మంత్రి పొన్నం “ఫ్లైయాష్‌” కుంభకోణం బయట పెట్టిన పాడి కౌశిక్ రెడ్డి !

-

మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి అడ్డుగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడుతున్న “ఫ్లైయాష్‌” కుంభకోణాన్ని పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టారు బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

ponam prabhakar vs padi koushik reddy

నా దగ్గరి మిత్రుడు అఖిల్ అనే వ్యక్తి ఫ్లై యాష్ వల్ల బండి స్కిడ్ అయ్యి మరణించాడని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. పేదోళ్ల శవాల మీద పైసల్ ఏరుకుంటున్న పొన్నం ప్రభాకర్‌కి అఖిల్ శాపం.. పాపం ఖచ్చితంగా తగులుతుందని హెచ్చరించారు. వెంటనే ఈ కుంభ కోణంపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. పొన్నం ప్రభాకర్‌ ను కేబినేట్‌ నుంచి తొలగించాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news