BREAKING : కామారెడ్డి జిల్లా BRS నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు

-

సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నియోజక వర్గంలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కామారెడ్డి జిల్లా బి.ఆర్.ఎస్. ముఖ్య నేతల కు ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో.. ఆ నియోజక వర్గంపై గులాబీ పార్టీ ఫోకస్ చేసింది.

ఈ నెల 7న ప్రగతి భవన్ లో జిల్లా ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించే అవకాశం ఉంది. మండలం నుంచి 5 నుంచి 10 మందికి చాన్స్ ఉంది. క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయనున్న గులాబీ బాస్ కేసీఆర్.. ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించనున్నారు. సీఎం కేసీఆర్‌ తో తొలి సమావేశం పై కామారెడ్డి నేతల్లో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news