తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ ప్రకటన

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్ తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు.

అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండు రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news