నూతన సచివాలయానికి ప్రతిష్టాత్మక అవార్డు

-

రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయానికి ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు దక్కింది. భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ రికార్డు లోకి ఎక్కింది. ఈ విషయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

 

దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డులలోకి ఎక్కిందని తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు, మంత్రి ప్రశాంత్ రెడ్డి కి అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఈ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు ప్రశాంత్ రెడ్డి. వారి ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news