గవర్నర్ తమిళిసై ని కలిసిన రాజాసింగ్ భార్య

-

గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్ సతీమణి ఉషా భాయి ఆయన సోదరీమణులతో కలిసి నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై ని కలిశారు. తన భర్త రాజా సింగ్ పై పిడి యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రభుత్వ ఒత్తిడితో అనేక కేసులు బుక్ చేసి, తన భర్తను నిర్బంధించారని ఆరోపించారు. తన భర్తకు న్యాయం జరిగేలా చూడాలని ఉషా భాయి గవర్నర్ ని కోరారు.

రాజాసింగ్ న్యాయం కోసం న్యాయస్థానంలో పోరాడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలను రుజువు చేయకపోవడంతో రాజాసింగ్ ను అదుపులోకి తీసుకునేందుకు విభిన్నమైన వైఖరిని అవలంబించిందని అన్నారు. మరి దీనిపై గవర్నర్ తమిళసై ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు అనేది సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడంతో పాటు పాత కేసులను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news