రూ.406 కోట్ల స్టైఫండ్‌ విడుదల చేసిన రేవంత్‌ సర్కార్‌ !

-

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ రెసిడెన్స్‌ వైద్యులు, మెడికల్‌ కాలేజీ, పారమెడికల్‌ వాళ్లకు 2024-25కి సంబంధించిన స్టైఫండ్‌ విడుదల చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు రూ.406 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ…ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఏడాదికి సరిపడా ముందే విడుదల చేసింది సర్కార్‌.

Release of stipend for Senior Resident Doctors, Medical College, Paramedicals for 2024-25

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైద్యానికి పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకున్నామని… రుణమాఫీ లో కోతలు ఉండవు అన్నారు. ఇచ్చిన మాటకంటే ముందే రుణమాఫీ చేస్తున్నామని.. త్వరలోనే నిధుల విడుదల జీవో చేస్తామన్నారు. ప్రజల సొమ్ము..ప్రజలకే పంచుతున్నాం…. కోతలు పెట్టాల్సిన పని లేదని వెల్లడించారు. రైతు భరోసా పై త్వరలోనే మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని వెల్లడించారు భట్టి.

Read more RELATED
Recommended to you

Latest news