ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని – రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందని రేవంత్ మండిపడ్డారు.

వీఆర్ఒల కు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. హామీలు ఇవ్వడం తప్ప… అమలు చేయాలన్న సోయి మీకు లేదని అగ్రహించారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అని రేవంత్ ఫైర్ అయ్యారు.

వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలని.. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రేవంత్

Read more RELATED
Recommended to you

Latest news