నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని కసరత్తులు చేస్తోంది.ఈ తరుణంలో మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.మే 6 సాయంత్రం నాలుగు గంటలకు వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.మే 7న రాహుల్ గాంధీ హైదరాబాద్ లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.బోయిన్ పల్లిలో పార్టీకి చెందిన పదిన్నర ఎకరాల్లో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి రాహుల్ గాంధీతో భూమిపూజ చేయించనున్నారు.అలాగే అక్కడ తెలంగాణ అమరవీరులు, ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగుల కుటుంబాలతో రాహుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

కాగా వరంగల్ సభను భారీ సక్సెస్ చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు.సభకు 5 నుంచి 6 లక్షల మందిని తీసుకు రావాలని చూస్తున్నారు.దీనికి తగ్గట్టే జిల్లాలకు సంబంధించిన ఇన్చార్జులను నియమించారు.మరోపక్క రాహుల్ గాంధీ పర్యటన కంటే ముందు జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.అందులో భాగంగా నేడు రేవంత్ రెడ్డి..కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు.రేవంత్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల డిసిసి అధ్యక్షులు సమావేశంలో భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news