BRS లో చేరిన RS ప్రవీణ్ కుమార్

-

ఇటీవలే  బీఎస్పీని వీడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఎర్రవల్లిలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ కుమార్ తో పాటు ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయనున్నాడు. వందలాది మంది శ్రేయోభిలాషులు, తనకు సన్నిహితుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటామని చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిలబడటానికి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాను. తాను ఎక్కడ ఉన్నా బహుజన నాయకుల అడుగుజాడల్లో, వారి భావజాలం అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు. నా అనుచరుల సంపూర్ణ మద్దతు కోరుతున్నాను’ అని ఆర్ఎస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news