బస్సులోనే ఉరి వేసుకున్న ఆర్టీసీ కండక్టర్

-

మహబూబ్ నగర్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ మహేందర్ రెడ్డి తాను పనిచేసే బస్సులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగుల్లో కలకలం రేపింది. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయమే విధులకు వచ్చాడు.

రిజిస్టర్ లో సంతకం చేసి డిపోలోని బస్సుల వద్దకు వెళ్లాడు. కానీ మహేందర్ రెడ్డి ఎంతకీ తిరిగి రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడగా బస్సులో పై రాడ్డుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలిలోకి వచ్చింది. అయితే ఆయన ఆత్మహత్యకి గల కారణాలు తెలియ రాలేదు. వ్యక్తిగత కారణాల? లేదా పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news