సామాన్యుడు చేసిన పనికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫిదా.. ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందులు పడే వారి బాదను అర్థం చేసుకొని సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రోడ్డు భద్రత విషయంలోనూ ప్రజల్లో అవగాహన కల్పించేవిధంగా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తూ.. వాటికి ఆసక్తికరమైన క్యాప్షన్ ను జోడిస్తూ.. ప్రజలను ఆలోచింపజేస్తుంటారు సజ్జనార్.

అంతేకాదు.. కొన్ని విషయాలపై తన దైన రీతిలో కూడా స్పందిస్తుంటారు. తాజాగా ఒక సామాన్యుడు చేసిన పనికి సజ్జనార్ ఫిదా అయ్యారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డి. రమేష్ అనే అతను చేసిన పనిని పొగుడుతూ.. ఓ పోస్ట్ చేశారు సజ్జనార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దుబ్బ చర్చకు చెందిన డి.రమేష్ కుమార్ వ్యవసాయం చేస్తుంటాడు. రోడ్డు ప్రమాదాల కారణంగా జరుగుతున్న మరణాలు చూసిన ఆయన ఉచితంగా హెల్మెట్స్ ను పంపిణీ చేయడం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కూడా భాగస్వామ్యం చేయడంతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ పోస్ట్ చేశాడు సజ్జనార్. వారం రోజుల్లో 150 హెల్మెట్స్ పంపిణీ చేశారు రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news