కేసీఆర్ వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడు విలీన మండలాలు ప్రజలు మళ్లీ తెలంగాణకు వెళ్తారా అని.. ఎవ్వరో అడిగితే మేము వెళ్లమని స్పష్టం చేశారు. అక్కడ ఏం లేవో కూడా చెప్పుకుంటే బాగుంటుంది. సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు జగన్ సీఎం కావాలని అంటున్నారు. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలవుతుందని.. కేసీఆర్ స్వయంగా చెప్పారు.

ఏపీ మాదిరిగానే తాము కూడా పెన్షన్లు అమలు చేస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. కోటి 60లక్షల కుటుంబాలలో కోటీ 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ది జరిగిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ రికార్డును ఎవ్వరూ కాదనలేరు. తమ ప్రైవేటు వ్యాపారాలను రక్షించుకునే వాళ్లు హైదరాబాద్ ర్యాలీలో పాల్గొన్నారని సజ్జల తెలిపారు. వంద మందో, రెండు వందల మందో చంద్రబాబుకు ర్యాలీకి రాకుండా ఎలా ఉంటారు. వంద వాహనాలు పెడిే రోడ్డు జామ్ కాకుండా ఉంటుందా..? జబ్బులున్నాయని చంద్రబాబు కోర్టుకు అబద్దాలు చెప్పాడని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news