తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఓవైసీ బ్రదర్స్ మా కాళ్లు పట్టుకుంటారు : రాజాసింగ్

-

తమను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మా సోదరులను జైలుకు పంపాలని కొందరూ చూస్తున్నారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేస్తారని అనిపిస్తోంది. హైదరాబాద్ లో బలంగా ఉన్న మమ్మల్ని ఓడించేందుకు కొందరూ ప్రయత్నిస్తున్నారు. ఎవ్వరూ ఎంత ప్రయత్నించినా హైదరాబాద్ లో గెలిచేది ఎంఐఎం అని పేర్కొన్నారు అక్బరుద్దీన్.

అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ ను బుల్లెట్ తోనే జైలులోనే చంపరు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్లను పైకి పంపాలా.. మరెక్కడికైనా పంపాలన్నది ఆలోచిస్తాం అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఓవైసీ బ్రదర్స్ మా కాళ్లు పట్టుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవడం ఓవైసీ బ్రదర్స్ కి అలవాటు అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news