తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలి

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ టీచర్లు స్థిర, ఛర భూములు కొన్నా, అమ్మినా అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. టీచర్లు తమ పేరిట ఉన్న ఆస్తులు, కుటుంబ సభ్యుల పేరిట భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య స్థలాలు, వ్యవసాయ భూములు ఇలా వాటి వివరాలను మార్కెట్ ధర ప్రకారం వెల్లడించాల్సి ఉంటుంది.

స్థిరచరాస్తులు తో కూడిన వివరాల నివేదికను ప్రైమరీ టీచర్లు అయితే హెడ్మాస్టర్ లకు, హై స్కూల్ టీచర్లు అయితే ఎంఈఓ లకు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఈ వివరాలన్నీ జిల్లా విద్యాధికారుల ద్వారా విద్యాశాఖకు చేరుతాయి. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్యాశాఖ టీచర్ల ఆస్తులను వెల్లడించాలని సర్క్యులర్ జారీ చేయడంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news