హిమాన్షు తిండిపై వైఎస్‌ షర్మిల సంచలన పోస్ట్‌ !

-

హిమాన్షు తిండిపై వైఎస్‌ షర్మిల సంచలన పోస్ట్‌ చేశారు. నా మనవడు ఏం తింటడో రంగయ్య మనవడు అదే తినాలే అని చెప్పిన కేసీఆర్ .. పేద విద్యార్థుల కడుపులు ఎండబెడుతున్నాడని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. పంచభక్ష్య పరమాన్నాలు దొర తింటుంటే..కనీసం పచ్చడి మెతుకులు కూడా పాఠశాలల్లో దిక్కులేదని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు, బ్రెడ్డు, పప్పు, పాయసంతో కొత్త మెనూ అంటూ ఉదరగొట్టి, దొర గారు మాటలతో కడుపులు నింపిండే తప్పా..కార్యాచరణకు నోచుకోలేదని ఆగ్రహించారు.

మీ రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారు. కార్యకర్తలకు విందు భోజనాలు పెడతారు.దొర రాజకీయాలకు, జల్సాలకు నిధులు ఉంటాయి కానీ..పేద పిల్లల మధ్యాన్న బోజన కష్టాలు తీర్చడానికి మాత్రం చేతులు రావన్నారు. విద్యార్థులు ఓటర్లు కాదని కేసీఅర్ కు చిన్న చూపు.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు దాటినా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పూర్తి స్థాయిలో అందడం లేదని విమర్శలు చేశారు.

పెట్టే బోజనానికి,సర్కారు ఇచ్చే నిధులకు పొంతన లేదని వంట కార్మికులు మొత్తుకుంటున్నా పట్టింపు లేదు.కోట్లలో పేరుకు పోయిన గత ఏడాది బిల్లులు చెల్లింపు మాటలకే పరిమితం అంటే విద్యార్థుల పట్ల దొరకున్న శ్రద్ధ ఏంటో కనిపిస్తోంది.కడుపు నిండా కమ్మని భోజనం పెడితే కమీషన్లు రావని పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నరు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.ఇప్పటికైనా మేలుకుని వంట కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.మాట ఇచ్చినట్లు కొత్త మెనూ ప్రకారం చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news