ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రను చేస్తావా..నీ పతనానికి ఇదే సంకేతం – షర్మిల

-

ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రను చేస్తావా..నీ పతనానికి ఇదే సంకేతమని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. స్పెషల్ ఫోర్స్ ను పెట్టి మరీ ఆదివాసీల గుడిసెలు పీకేపిస్తున్నాడని నిప్పులు చెరిగారు. తాజాగా ఆదివాసీ మహిళను పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియో వైరల్‌ అయింది.

దీనిపై షర్మిల సందిస్తూ… వాట్ ఇస్ వాట్.. వాట్ ఇస్ నాట్ .. కుర్చీ వేసుకొని మరి పోడు భూముల లెక్క తేల్చుతా అని, ఈరోజు వాళ్లకు నీడ – గూడు లేకుండా.. ఆడవాళ్ళు అని చూడకుండా ఒంటి మీది గుడ్డలు ఊడిపోతున్నా, చూడకుండా ఈడ్చి పడేపిస్తున్నారని ఓ రేంజ్‌ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొన్న చంటి బిడ్డల తల్లులను జైల్లో పెట్టించారు.ఇయ్యాల ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారన్నారు. పోడు పట్టాల కోసం పోరాడుతున్న ఆదివాసీ ఆడ బిడ్డలను వివస్త్రను చేసిన పాలన మీ నయా నిజాం నిరంకుశ పాలనకు పరాకాష్ఠ. ఇది మీ పతనానికి సంకేతం.మీ పాలనకు ముగింపు అంటూ విమర్శలు చేశారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news