తెలుగు రాష్ట్రాల వరద నష్టం పై అమిత్ షా కి శివరాజ్ సింగ్ ప్రాథమిక నివేదిక

-

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో  రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.  ఇక రెండు రాష్ట్రాల్లో వరదలు మిగిల్చిన తీవ్ర నష్టాన్ని అంచనా వేయడానికి  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  పర్యటించారు. తెలంగాణ లోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించగా.. ఏపీ లోని విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించారు మంత్రి.   వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను తాజాగా శివరాజ్ సింగ్ చౌహాన్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు సమర్పించారు.

తెలంగాణ, ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో నేడు మరో కేంద్రబృందం పర్యటిస్తోందని.. కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన తరువాత రెండింటినీ పరిశీలించి రాష్ట్రాలకు విపత్తు సహాయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల అతలాకుతలం అయిన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తక్షణ సహాయం కింద రూ.3300 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news