కమలం పార్టీ నేతల తీరు సమాజం సిగ్గుపడేలా ఉంది – మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో ఆ పార్టీ నేతలకు తెలుసని అన్నారు. కారణం తెలిసినా వారు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. తమ రాజకీయ అవసరాల కోసం బిజెపి నాయకులు పేపర్ లీక్ చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్లను లీక్ చేసిన నిందితుడు కూడా బిజెపి కార్యకర్తే అని విమర్శించారు.

బిజెపి పాలిత ప్రాంతాలలో పేపర్ లీక్ చేయడం సర్వసాధారణం కాబట్టి ఆ కుట్రలను తెలంగాణలో కూడా అమలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిజెపి నేతలు చిల్లర రాజకీయాల కోసం చివరకు గుళ్లను, స్కూళ్లను కూడా వదలడం లేదని విమర్శించారు. కమలం పార్టీ నేతల తీరు సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు శ్రీనివాస్ గౌడ్. టెన్త్ ప్రశ్నాపత్రాల వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news