నా చారిటీని కొందరూ కుట్రతో రద్దు చేయించారు.. కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

-

కే.ఏ.పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నిత్యం ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలుస్తుంటాడు. తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన వాస్తవాలు చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ నమ్మడం లేదు. అలాంటి కే.ఏ.పాల్ తాజాగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తన చారిటీని కావాలనే కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఇవాళ ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదాశివపేట లో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి తెలిపినట్లుగా వివరించారు. చారిటీ ద్వారా సుమారు రూ.53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని అన్నారు. కావాలని తన చారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ఆరోపించారు. అదేవిధంగా భూములను లాక్కునేందుకు తమపై దాడులు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news