తెలంగాణలో భారీగానే వర్షాలు కురుస్తాయి – స్వర్ణలత

-

తెలంగాణలో భారీగానే వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి ఉజ్జయిని స్వర్ణలత వెల్లడించారు. మీరు కోరినట్లు సంతోషంగా పూజలు అందుకున్నా..బాలింతలకు, గర్భిణీలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా.. నన్ను దర్శించుకున్న వారిని సంతోషంగా చూసుకుంటానని తెలిపారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

Rangam Bhavishyavani 2024

మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని ఆమె తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాతానని అభయమిచ్చారు. ప్రజలను చల్లగా చూస్తానని చెప్పారు. మట్టి బోణమైనా, బంగారు బోనమైనా అందుకునేది నేనే కదా..ఎవరు ఎత్తుకొచ్చినా సంతోషంగా అందుకుంటాను అని చెప్పారు. కోరిన అన్ని వర్షాలు కురుస్తాయి..ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి..మీ అందరికీ నేను ఉన్నానని తెలిపారు. కష్టం లేకుండా ఉంటే సోమరిపోతులు అవుతారు కదా..నా దగ్గరికి రావడానికి ఆ మాత్రం కష్టం పడాలి కదా..నన్ను కొలిచే వారికి నేను తొడుంటానని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news