సీఎం కేసీఆర్‌… శ్రీకృష్ణ దేవరాయలు అంతటి వారు – స్వరూపానందేంద్ర స్వామి

-

యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని… విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు మాదిరిగా సీఎం కేసీఆర్‌ యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో ఇంత మంచి రాతి నిర్మాణం మునుపెన్నడూ జరుగలేదని చెప్పారు.

కేసీఆర్‌ చొరవతోనే ఇది సాధ్యమైందని.. ఆయన యాదాద్రి ఆలయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని కొనియాడారు. మంగళవారం పీఠాధిపతి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతితో కలిసి.. స్వరూపానేందేంద్ర సరస్వతి స్వయం భూ పంచనారసింహుడిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలు ఎవరి సొత్తూ కాదని.. ఏ ఆలయాన్నీ శైవానికో, వైష్ణవానికో పరిమితం చేయకూడాదని కోరారు. ఆలయాలు సనాతన ధర్మానికి చెందిన సంపదగా పేర్కొన్నారు. ఆదిశంకరచార్యలు వారి సంప్రదాయ పీఠాలకు హైందవ ధర్మమే ముఖ్యమమని చెప్పారు స్వరూపానందేంద్ర సరస్వతి.

Read more RELATED
Recommended to you

Latest news