త్వరలో నిజామాబాద్ లో టిడిపి భారీ బహిరంగ సభ

-

నేడు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ దశ మహా విద్యా పూర్వక నవ చండీయాగం నిర్వహించారు. ఈ యాగంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం చేసినట్లు తెలిపారు కాసాని జ్ఞానేశ్వర్.

ఇక త్వరలోనే నిజామాబాదులో భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందని.. సభకి సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. అలాగే త్వరలోనే చంద్రబాబు చేతుల మీదుగా బస్సు యాత్రను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు నాయుడుని అడ్డుకోవడం హేయమైన చర్య అని.. ప్రతిపక్ష నేతల పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news