శబరిగా ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.!

-

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా నడుస్తోంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమిళంలో కంటే తెలుగులో అవకాశాలు ఇస్తున్నారు. తాను వేసిన పాత్రలు తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇక క్రాక్ సినిమా లో వేసిన పాత్ర తో మరోసారి ఆమె తనలోని టాలెంట్ చూపెట్టింది. దానితో మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కంటూ వస్తున్నాయి.

ప్రస్తుతం బాలయ్య బాబు నటించిన వీరసింహరెడ్డి లో కూడా దర్శకుడు గోపిచంద్ మలినేని మరో సూపర్ కారెక్టర్ ఇచ్చారట. దానితో ఆమె బాలయ్య తో సవాల్ విసురుతున్న పాత్రలో నటించి తన పవర్ చూపించిందట. ఇక ఇలాంటి పాత్రలే కాక లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటిస్తూ తనని తాను నిరూపించు కుంటూనే ఉంది.

తాజాగా వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ `శ‌బ‌రి`. అనిల్ కాట్జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిచారు‌. సస్పెన్సే థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమా ను పలు  భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.  ఈ సంద‌ర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ గ్లిమ్స్ ని `వ‌ర‌ల్డ్ ఆఫ్ శ‌బ‌రి` పేరుతో మంగ‌ళ‌వారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఈ ఫ‌స్ట్ గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు

 

Read more RELATED
Recommended to you

Latest news