సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణా అసెంబ్లీ

-

సెప్టెంబర్ 7వ తేదీ నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున ఈ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.

20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులను కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఇప్పటి నుండే సంసిద్ధంగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news