దివంగత మాజీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సంతాపం

-

దివంగత మాజీ ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. అటు ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ.. సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావును అసెంబ్లీలో ప్రకటించారు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్.

Telangana assembly meetings

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిపై సభలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేసారు. దశాబ్ద కాలం పాలించిన గత పాలకులు..అన్ని వనరులను అనుకున్న దిశగా నడిపించలేదని ఆగ్రహించారు. రోజు వారి ఖర్చులు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. ఇలాంటి దుస్థితి రావడం ..బాధాకరమన్నారు. ఆర్థిక ఆరాచకత్వం జరిగింది…ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వివరించారు. అందుకే మేము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

Read more RELATED
Recommended to you

Latest news