తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత పై పేర్ని నాని ఫైర్..!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే.. డిక్లరేషన్ పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. ప్రదానంగా తెలంగాణ బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పక్కా రాష్ట్రం నుంచి భజన చేసుకుంటూ తిరుపతికి వస్తున్నారని.. అది దిక్కుమాలిన తనం అని ఘాటుగా స్పందించారు.

మాధవీలత తన ఆసుపత్రిలో భజన చేయాలని సూచించారు. ఆసుపత్రిలో ఒక్క పేషెంట్ కు అన్న ఫీజు తగ్గించారా..? అని ప్రశ్నించారు పేర్నినాని. కరోనా సమయంలో రోగుల నుంచి కోట్లు దోచుకున్నారన్నారు. ఒవైసీ ఆసుపత్రిలో హిందువులకు ఫీజు తగ్గించారా..? అని అడుగుతున్న మాధవీ లత.. తన ఆసుపత్రిలో తగ్గించారా..? అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతికి వెళ్లారని.. డిక్లరేషన్ ఇవ్వమని అప్పుడు ఎందుకు అడగలేదన్నారు. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న ఎంపీల నోరు ఆ రోజు ఏమైంది..? అని ప్రశ్నించారు పేర్నినాని.

Read more RELATED
Recommended to you

Latest news