రెండు లక్షలు దాటిన తెలంగాణా కేసులు…!

-

తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్ధంగా పని చేస్తుంది. తెలంగాణాలో మొత్తం కేసులు 2 లక్షలు దాటాయి. నిన్న ఒక్క రోజే 1335 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణా మొత్తం కేసులు 2 లక్షల 611 కి చేరుకున్నాయి. తెలంగాణాలో యాక్టివ్ కేసులు 27052 ఉన్నాయి. నిన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1717 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ లో అత్యధికంగా 262 మందికి కరోనా సోకింది. కరోనా నుంచి కోలుకుని 72 వేల 388 మంది కోలుకున్నారు. రంగారెడ్డి జిల్లలో కాస్త కేసులు పెరుగుతున్నాయి. 137 మందికి కరోనా సోకింది. మేడ్చల్ లో 92 మంది కరోనా బారిన పడ్డారు. రోజువారీ కేసులను రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news