ఖమ్మంలో హెల్త్‌ డైరెక్టర్‌ క్షుద్ర పూజలు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు

-

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌ మండలంలో.. ఓ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. అయితే.. ఈ పూజలో మిరపకాయలు తదితర వస్తువులు వాడటంతో.. ఆయన క్షుద్ర పూజలు అని అందరూ అనుకున్నారు. అదే ప్రచారం జరుగుతోంది.

అయితే.. ఈ వివాదంపై స్వయంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు స్పందించారు. నేను హోమంలో పాల్గొన్నాను. ఓ ప్రజాప్రతినిధుల కుటుంబం ఇంటికి వెళ్లానని పేర్కొన్నారు. తాను ఎలాంటి క్షుద్ర పూజల్లో పాల్గొనలేదని.. నాకు రాజకీయ పదవులపై ఆశ లేదని చెప్పారు.

కోవిడ్ సమయంలో నేను మా నాన్నను కోల్పోయానని.. పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు. నేను అంటే గిట్టని వాళ్ళు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. కొత్తగూడెం నుంచి చాలా మంది ఉన్నారు. కానీ కొత్తగూడెంకు ఏమి చేయలేదన్నారు. నేను కొత్తగూడెం ప్రజలకు సేవ చేయడం కొందరికి నచ్చడం లేదని.. నేను భవిష్యత్ లో చాలా సేవ కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు శ్రీనివాసరావు.

https://www.youtube.com/watch?v=Z2n8K-7HX7Y

Read more RELATED
Recommended to you

Latest news