Telangana: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రానికి 3వ ర్యాంకు

-

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పంజాబ్‌, హరియాణాలు వరుసగా 1,2 స్థానాల్లో నిలిచాయి. ఏపీ ఆరో స్థానంలో ఉంది. 1970-71 నాటి దిగుబడులతో 2019-20 నాటివి పోల్చి నాబార్డు రాష్ట్రాల వారీగా ర్యాంకులు ప్రకటించింది.

‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత వ్యవసాయ రంగం ప్రయాణం’ అనే పేరుతో వ్యవసాయరంగం అభివృద్ధి, రైతుల ఆదాయం పెరుగుదల తదితర అంశాలపై పరిశోధించి నివేదికను ‘జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు’(నాబార్డు) తాజాగా విడుదల చేసింది. దేశంలో రాష్ట్రాల వారీగా ఆహారధాన్యాల హెక్టారుకు సగటు ఉత్పాదకతలో తెలుగు రాష్ట్రాలు వృద్ధిని సాధించాయి.

1970-71లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఉన్నా తెలంగాణ, ఏపీలకు విడివిడిగా 23వ ర్యాంకును నాబార్డు నివేదికలో ప్రకటించింది. అప్పటితో పోలిస్తే. 2019-20 నాటికి తెలంగాణ 3, ఏపీ 6వ స్థానానికి చేరాయని తెలిపింది. 1970-2020 మధ్య పంజాబ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా అప్పుడు 2, 3 స్థానాల్లో ఉన్న కేరళ, తమిళనాడు కిందకు దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news