అమెరికాలో కాల్పులు.. 9 మంది మృతి

-

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో 2 చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అటు అయోవాలోని డెస్ మోయిన్స్లోని ఓ స్కూల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. ఓ ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. రెండు రోజుల క్రితం కూడా అమెరికాలో అలాంటి ఘటనే జరిగింది. లాస్‌ఏంజెల్స్‌ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలు జరుగుతండగా.. ఈ ఘటన జరగడం తీవ్ర విషాదం నింపింది. కాల్పుల్లో సుమారు పది మంది వరకు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే కాల్పులు చేపట్టిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news