Padma awards 2023 : తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీళ్లే

-

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం 106 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. విభిన్న రంగాల్లో సేవలందించిన ఆరుగురికి పద్మ విభూషణ్‌, 9 మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’కు ఈ జాబితాలో ఎవరినీ ఎంపిక చేయలేదు.

తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది పద్మ పురస్కారాలను అందుకోగా.. వీరిలో ఇద్దరిని పద్మభూషణ్​ వరించింది. చినజీయర్ స్వామి, కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించగా.. రాష్ట్రానికి చెందిన బి.రామకృష్ణారెడ్డి, ఎం.విజయగుప్తా, పసుపులేటి హనుమంతరావులను పద్మశ్రీ పురస్కారం వరించింది.

వీరితో పాటు ఏపీకి చెందిన సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి, సంకురాత్రి చంద్రశేఖర్‌, కోట సచ్చిదానంద శాస్త్రి, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ప్రకాశ్ చంద్రసూద్‌, సి.వి.రాజు, గణేశ్ నాగప్ప కృష్ణరాజనగరకు పద్మశ్రీ దక్కింది. సామాజిక సేవా విభాగంలో ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్​లను పద్మశ్రీ పురస్కారం వరించింది.

పద్మభూషణ్​ తెలంగాణ..

 

చినజీయర్ స్వామికి పద్మభూషణ్‌ పురస్కారం

కమలేశ్ డి.పటేల్‌కు పద్మభూషణ్‌ పురస్కారం

 

పద్మశ్రీలు తెలంగాణ..

 

బి.రామకృష్ణారెడ్డి

ఎం.విజయగుప్తా

పసుపులేటి హనుమంతరావు

 

పద్మశ్రీలు ఆంధ్రప్రదేశ్​..

 

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి

సంకురాత్రి చంద్రశేఖర్‌

కోట సచ్చిదానంద శాస్త్రి

అబ్బారెడ్డి నాగేశ్వరరావు

ప్రకాశ్ చంద్రసూద్‌

సి.వి.రాజు

గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర

Read more RELATED
Recommended to you

Latest news