BREAKING : బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత

-

జనగామ జిల్లా దేవరుప్పుల లో బండి సంజయ్ కుమార్‌ చేస్తున్న ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు రాళ్ళ దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ప్రసంగిస్తుండగా అభ్యంతరం వ్యక్తం చేశాడు ఓ టీఆర్ఎస్ నాయకుడు.

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించాడు బండి సంజయ్. దేశంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారని బండి సంజయ్ ని అడిగాడు టీఆర్ఎస్ నాయకుడు. దీంతో టీఆర్ఎస్ ,బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం నెలకొంది.

ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బీజేపీ వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకుల నినాదాలు చేశాడు. అయితే..ఇంత జరుగుతున్నా.. సీపీ ఏం చేస్తున్నాడంటూ బండి సంజయ్ సీరియస్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు మా పాదయాత్ర తెలుసుగా.. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news