బీజేపీ అధికారంలోకి వస్తే చేసేది అదే : రాహుల్ గాంధీ

-

దేశంలో దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇవాళ నిర్మల్ లో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో మాట్లాడారు రాహుల్ గాంధీ. ముఖ్యంగా దేశంలో రిజర్వేషన్ ప్రధాని మోడీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే.. 50 శాతం లిమిట్ ఎత్తేస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుంది. మీ హక్కులను కొల్లగొట్టే కుట్రలు చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామన్నారు రాహుల్. మీ రిజర్వేషన్ ను మోడీ లాక్కోవాలని కుట్ర చేస్తున్నారు. ప్రైవేటీకరణ అంటే రిజర్వేషన్లను ఎత్తేయడమే అన్నారు. కులగణనలో ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణను అత్యధిక మేజార్టీతో గెలిపించి లోక్ సభకు పంపించండి. ఈమె తెలంగాణ పేద ఆదివాసీల పట్ల కొట్లాడే గొంతుక అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news