దసరా పండుగ వేళ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం

-

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం దసరా పండగకి మరో శుభవార్త తెలిపింది. తెలంగాణ ఆరోగ్యశాఖలో 371 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్  జారీ చేసింది. 371 ఉద్యోగాల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు ఉండగా.. 99 ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. కాగా గత సెప్టెంబర్ లోనే 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ప్రస్తుతం విడుదల చేసిన 371 పోస్టుల ప్రకటన, గతనెల నోటిఫికేషన్ కు అనుబంధంగా కొనసాగనుంది.

దీంతో  మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్లతోపాటు, 99 ఫార్మసిస్టు పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులకు అక్టోబర్ 14 వరకు తుది గడువు ఉంది. అయితే కొత్తగా పోస్టులు పెంచడం తో డేట్ నీ కూడా పెంచే అవకాశం ఉంది. వాస్తవానికి నవంబర్ 17న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  కానీ ఇటీవలే నవంబర్ 23 న పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించారు.  ఈ మేరకు
తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినీయోగం చేసుకోగలరు.

Read more RELATED
Recommended to you

Latest news