బూటకపు హామీల కేసీఆర్ సర్కార్ కు బైబై చెప్పే సమయం వచ్చేసింది: తరుణ్ చుగ్

-

బూటకపు హామీల కేసీఆర్ సర్కార్ కు బై బై చెప్పే సమయం వచ్చేసిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 529 రోజులే మిగిలాయి అని గుర్తు చేశారు. ఇకపై తెలంగాణ బిజెపి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ కౌంట్డౌన్ బోర్డును వినియోగిస్తామని అన్నారు.

ప్రతి బిజెపి కార్యాలయం ముందు ఈ బోర్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టిఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, బూటకపు హామీలను ఎండగడుతూ కుటుంబ వాద పాలనను గుర్తు చేస్తూ ‘ప్రజా సంగ్రామ యాత్ర ‘ కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ కలలను చూపించి.. బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని సహకారం చేసుకున్నారని తెలిపారు.

తెలంగాణ కోసం తాము చేసిన త్యాగాలను వృధా చేసేలా కెసిఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారనే ఆందోళన తెలంగాణ ఉద్యమకారుల్లో ఉందని చెప్పారు. జూన్ 3 న సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. దీనికి 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news