అక్కడ అగర్భ శత్రువులు.. ఇక్కడ మంచి మిత్రులు.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

-

జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఆగర్భ శత్రువులు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు మంచి మిత్రులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. “ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా పై ఉక్కు పాదం చూపించారు.  జాబ్ క్యాలెండర్ లేదు. కొత్త ఉద్యోగాలు లేవు. నిరుద్యోగభృతి రాదు. అధికారం కోసం అశోక్ నగర్ గడపతొక్కారు. అధికారం దక్కిన తర్వాత నిరుద్యోగుల గొంతునొక్కారు.

న్యాయం కోసం నిలదీసిన దళిత రైతు వెంకటయ్య అరెస్టు అయ్యారు.  దళిత రైతు అభిప్రాయం తీసుకున్నారు జర్నలిస్టులు. రేవతి, తన్వియాదవ్ లకు జైలు శిక్ష.  మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ ఇంటి మీద దాడికి యత్నం చేశారు.  ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు చేస్తున్నారు.  రాజ్యాంగం పట్టుకుని దేశంలో తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న అరాచక కాంగ్రెస్ పాలన కనిపించడం లేదా ? జాగో తెలంగాణ జాగో” అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news