జూన్ 04 తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

జూన్ 04 తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.

 

నిజామాబాద్ తో  సహా రాష్ట్రంలో 12 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ఎలాంటి వివాదం లేదు. రాష్ట్ర గీతం గురించి బయటపెట్టామని.. రాష్ట్ర చిహ్నం గురించి అఖిల పక్షంతో సమావేశం నిర్వహించినట్టు గుర్తు చేశారు. కేసీఆర్ అలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ముఖ్యంగా  కేసీఆర్ హయాంలో అన్ని స్కీముల్లో స్కాములు జరిగాయి. బీఆర్ఎస్ కి తెలంగాణలో ఒక్కస్థానం కూడా రాదన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వస్తుందని గెస్ చేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ-కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news