ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారు – రేవంత్ రెడ్డి

-

ప్రశ్నాపత్రాల లీకేజీలో అధికారి శంకర లక్ష్మి పాత్ర ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు టిపిసిసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో వంద మార్కులు దాటిన వారిని విచారించాలన్నారు. పెద్దల పేర్లు చెబితే ఎన్కౌంటర్ చేస్తామని జైలులో లీకేజీ కేసు నిందితులను బెదిరించారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే జరిగిందని ఆరోపించారు.

కేటీఆర్ పిఏ తిరుపతి రెడ్డికి నిందితుడు రాజశేఖర్ రెడ్డి కి సంబంధం ఉందన్నారు. వీరిద్దరిదీ పక్కపక్క గ్రామాలేని.. గ్రూప్ 1 పేపర్ లీకేజీలో తిరుపతి కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి చెప్పడంతోనే రాజశేఖర్ కు టీఎస్పీఎస్సీ లో ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయడం కాదు.. చంచల్గూడా జైలులో పెట్టాలని అన్నారు. పేపర్ల లీకేజీ లో కేవలం ఇద్దరికీ మాత్రమే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news