అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

-

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు అయ్యప్ప స్వాములు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంకి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా.. వీళ్ల కారు తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైంది.

వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే  మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రయాణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే  మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారిలో సుబ్బయ్యనాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 

Read more RELATED
Recommended to you

Latest news