BREAKING : సూర్యాపేట జాతీయ రహదారిపై ప్రమాదం.. ముగ్గురు మృతి

-

సూర్యాపేటలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి పంపించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

A terrible accident in AP Three youths died

ఈ ఘటనలో మృతి చెందిన వారిని మహ్మద్‌ నవీద్‌ (25), నిఖిల్‌రెడ్డి (26), రాకేశ్‌(25)గా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడిని ఆదిత్యగా గుర్తించారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నవీద్ అనే యువకుడు మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చాడు. పార్టీ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news