BREAKING : తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ట్‌. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు ఉండనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు. కాగా, బంగాళాఖాతంలో వచ్చే నెల 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాత ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news