గ్రూపు -1 దరఖాస్తుల ఎడిట్ కి రేపు లాస్ట్ డేట్

-

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నావారికి.. TSPSC దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది.దీంతో అభ్యర్థులు అప్లికేషన్ లో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉంటుంది. కాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.

563 గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో ఎడిట్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్ ఉంది. వ్యక్తిగత వివారల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి హోం పేజీలో కనిపించే గ్రూప్-1 సర్వీస్ ఆన్ లైన్ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news