BREAKING : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ !

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. కాసేపటి క్రితమే.. హైదరాబాద్‌ లోని విద్యుత్‌ సౌధ వద్ద టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ని అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన నేపథ్యంలో.. రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది.

ఇందులో భాగంగానే.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. పెద్ద ఎత్తున కార్యకర్తలతో.. విద్యుత్‌ సౌధ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే.. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.టీఆర్ఎస్ పార్టీ రోడ్లపైన, జాతీయ రహదారులపై టెంట్లు వేసి మీడియాకు ఫోజులు ఇస్తే పోలీసులకు మాత్రం ఇది ఎక్కడ కనిపించలేదని… ప్రజల తరుపున మేం నిరసన తెలుపుదాం అంటే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని విమర్శించారు రేవంత్‌ రెడ్డి. మేమేమైనా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చామా…? అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news