నేటి నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ

-

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసి  పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు జరిగిన తరువాత అభ్యర్థులు ఎంపిక చేశారు. కొంత మంది ఎంపిక కానీ అభ్యర్థులు  హైకోర్టులో  కేసు వేశారు. తమకు మార్కులు కలపాలని కోర్టులో కేసు వేయడంతో కానిస్టేబుల్ ఉద్యోగులను నియమించేందుకు కాస్త ఆలస్యం అయింది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో 9,333 మంది కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇవ్వనుండగా.. రెండో విడుతలో 4,725 మంది TSSP కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండో విడుత ట్రైనింగ్ సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news