ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దు : TSPSC

-

ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దని ఉద్యోగాల భర్తీపై TSPSC కీలక ప్రకటన చేసింది. భారీగా రిలీజ్ అయిన ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీఎస్పీఎస్సీ తెలిపింది.

ఉద్యోగాల కోసం అభ్యర్థులు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల మేరకే జరుగుతుందని వెల్లడించింది. నియామక ప్రక్రియపై నకిలీ ప్రకటనలు నమ్మవద్దని తెలిపింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక సైట్ చూడాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news