ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ ధరలపై50 శాతం డిస్కౌంట్..!

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందింది. టికెట్ ధరలపై50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది ఆర్టీసీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి. పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు దారిన స్త్రీ, పురుషులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టిసి వెల్లడించింది.

వయసు ధ్రువీకరణకు ఆధార్ కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాదులో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టి-24 టికెట్ ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్ ధర 50గా నిర్ణయించింది. రాయితీలను ఉపయోగించుకునే స్వాతంత్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033 లను సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news