ఈనెల 25న బీజేపీ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరో ఆందోళనకు సిద్ధమైంది. ‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేపట్టాలని నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నిరుద్యోగ యువతతో కలిసి ఈ నిరుద్యోగ మహా ధర్నా నిర్వహించనుంది.

ఈరోజు మధ్యాహ్నాం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్ట్ వంటి అంశాలపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు ఆంటోనీ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నేపథ్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగావ వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా సాగర హారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకొచ్చాయి. తొలుత ఈనెల 25న ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news