మీడియాపై విజయశాంతి అసహనం..బూతులు తిడుతూ ?

-

మీడియాపై విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు..బూతులు తిడుతూ రెచ్చిపోయి సోషల్‌ మీడయాలో పోస్ట్‌ పెట్టారు విజయశాంతి. గత కొన్ని దినాలకెల్లి, తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై వార్తలు నిరంతరం వస్తున్నాయని… కానీ, బండి సంజయ్ గారి మార్పుకు కారణం మాత్రం ఎవ్వరూ పత్రికలల్ల రాయటం లేదు, న్యూస్‌ల చెప్పటం లేదని వ్యాఖ్యానించారు.

2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికలు, అప్పటిదాంక తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మార్పు లేదు అని ఇంచార్జి తరుణ్ ఛుగ్ గారు కూడా ఈ మధ్యనే స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇంతలోనే మార్పు వార్తలు ఎందుకు అన్నది… దేశం కోసం, ధర్మం కోసం ప్రాణమిచ్చి పనిచేసే కార్యకర్తలకు తెలియచెయ్యవలసిన అవసరం ఆ పత్రికలకు, న్యూస్ మీడియాకు కొంచమైనా ఉంది కదా… అని ఫైర్‌ అయ్యారు. అంతేకాదు.. జై శ్రీరాం, హర హర మహాదేవ్, జై తెలంగాణ అంటూ స్లోగన్స్‌ కూడా ఇచ్చారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news