బండి సంజయ్ కి విజయశాంతి భరోసా

-

బండి సంజయ్ కి విజయశాంతి భరోసా కల్పించారు.బీజేపీ నేతల పాదయాత్రలంటే… అవేవో తన గుండెల మీద తన్నుతున్న ఇనుప పద ఘట్టనల్లా సీఎం కేసీఆర్ గారికి అనిపిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి భైంసా పాదయాత్ర అనే సరికి కేసీఆర్ గారికి, ఆయన గారి టీఆరెస్‌కి సయామీ కవల పార్టీ అయిన ఎంఐఎం పెద్దలకు మరికాస్త వణుకు పుట్టిందనిపేర్కొన్నారు.

 

మతపరంగా సున్నితమైన ప్రాంతమని, సమస్యాత్మకమని చెప్పి పాదయాత్రకు అనుమతి రాకుండా చేశారు. నిజానికి భైంసా వెళ్లకుండా సంజయ్ గారిని ఆపడమంటే… తాము ఇప్పటికీ భైంసాను శాంతియుత ప్రాంతంగా మార్చలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒప్పుకోవడం గాక మరేంటి? బీజేపీ అధ్యక్షుడు భైంసా వెళ్లకుండా అడ్డుకోవడం కేసీఆర్ ప్రభుత్వం గొప్ప గాదు…. ఆ సమస్యాత్మక ప్రాంతంలోని పరిస్థితుల్ని నేటికీ ఎంతమాత్రం మెరుగుపరచలేకపోయిన తెలంగాణ సర్కారు చేతగానితనం. సంజయ్ గారు భైంసా వెళితే… తమ సర్కారు వైఫల్యాలన్నిటినీ మరింతగా బట్టబయలు చేస్తారనే భయంతోనే సర్వశక్తులూ ఒడ్డి ఆగమేఘాల మీద ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు జరిగాయన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news