ఓవైసీ బ్రదర్స్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

-

ఓవైసీ బ్రదర్స్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. శతాబ్దాల కాలంగా సాగిన హిందువుల పోరాటాలు, త్యాగాల ఫలంగా నేడు అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మితమవుతోందని.. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతునే శ్రీరామ జన్మభూమి అయిన…పలు సందర్భాల్లో వారు చేసిన మత విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజలకు కొత్త కాదని పేర్కొన్నారు. ఓవైసీ బ్రదర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఇక్కడెవరికీ లేదని వారు గ్రహించాలని… ఓవైసీ మాటలను వారి సయామీ ట్విన్స్ టీఆరెస్ తప్ప దేశ ప్రజలెవరూ విశ్వసించరని మండిపడ్డారు.

పలు సందర్భాల్లో వారు చేసిన మత విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజలకు కొత్త కాదు. ఓవైసీ బ్రదర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఇక్కడెవరికీ లేదని వారు గ్రహించాలని… ఓవైసీ మాటలను వారి సయామీ ట్విన్స్ టీఆరెస్ తప్ప దేశ ప్రజలెవరూ విశ్వసించరన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పాతబస్తీ వైపు ఒకసారి చూస్తే… అసదుద్దీన్ గారి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్న విషయం పసిపిల్లలకు కూడా అర్థమవుతుందని మండిపడ్డారు. అంతేగాక, సమాజ్‌వాదీ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆలయ నిర్మాణం జరగకుండా చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమేనని… అయితే, అభివృద్ధి గురించి అసదుద్దీన్ గారు మాట్లాడటమే విడ్డూరంగా ఉందని రాములమ్మ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news